న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏదో ఒక చోట ఇంకా మానవత్వం మిగిలే ఉందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు (Viral Video) వెల్లడిస్తుంటాయి. స్వార్ధంతో నిండిన సమాజంలో దయార్ధ్ర హృదయులకూ కొదవలేదని నిరూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇక మండే ఎండల్లో జనం ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే, నోరు లేని జీవాలూ దాహార్తితో తల్లడిల్లుతున్నాయి.
ఈ క్రమంలో ఓ జీవానికి ఒక వ్యక్తి నీటిని అందించి దాహార్తిని తీర్చిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి చిన్న వాటర్ బాటిల్ను పట్టుకుని ఓ చెట్టు వద్దకు వస్తుండటం కనిపిస్తుంది. ఆపై చెట్టు కొమ్మపై కూర్చుని దాహంతో అలమటిస్తున్న ఉడత వద్దకు వెళ్లి నీరు పట్టడం చూడొచ్చు.
Earning the trust of a thirsty squirrel with few drops of water. And watching in loops the moment when it asks for more towards the end 💕💕
(Via Biltek Videos) pic.twitter.com/rqKTr5xBxx— Susanta Nanda (@susantananda3) June 15, 2023
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పదివేల మంది పైగా వీక్షించగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. దాహంతో తడారిన ఉడుతకు నీరందించిన వ్యక్తి దయాగుణాన్ని పలువురు ప్రశంసించారు. మండే ఎండల్లో పక్షులకు కాసిని నీళ్లు పట్టాలని ప్రతి ఒక్కరూ ఈ దిశగా కదలలని యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More