గ్రీస్: యూరోప్లోని గ్రీస్ సమీపంలో ఓ ఫిషింగ్ బోటు బోల్తా(Boat Disaster) కొట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇప్పటికే 78 మంది మృతిచెందారు. అయితే ఆ బోటులో దాదాపు వంద మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారు ఈ విషయాన్ని తెలిపారు. వలసదారులతో వెళ్తున్న ఆ బోటులో దాదాపు 750 మంది ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా వందల సంఖ్యలో వలసదారులు మిస్సింగ్లో ఉన్నారు.
గ్రీస్ తీర ప్రాంతంలో భారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఆ బోటులో ఉన్నట్లు మెడిక్స్ తెలిపారు. ఎక్కువ శాతం మంది పురుషుల ప్రమాదం నుంచి బయటపడ్డారని, వారి ద్వారా చిన్నారుల గురించి సమాచారం అందుతున్నట్లు వెల్లడించారు. నౌక ప్రమాదం నుంచి బయటపడినవారిని విచారించిన తర్వాత పిల్లల సంఖ్యపై సేవ్ ద చిల్డ్రన్ కూడా క్లారిటీ ఇచ్చింది.