Pension | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం ఈసారి మాజీ సైనికోద్యోగులపై తన అసహనం వెళ్లగక్కింది. సోషల్ మీడియాలో కేంద్రాన్ని విమర్శించే మాజీ సైనికులపై కేసులు పెడుతామని, పెన్షన్ను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఉద్యోగ జీవితం, దౌత్యపరమైన అంశాలు, సార్వభౌమ నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై మాజీ సైనికులు సోషల్ మీడియాలో విమర్శనాత్మక పోస్టులు పెడితే పింఛన్ను నిలిపివేస్తామని భారత సైన్యం హెచ్చరించింది. ఈ మేరకు మేలో ఓ సర్క్యులర్ జారీచేసింది. సరిహద్దులో చైనా ఏర్పాటు చేసిన పోస్టులపై కేంద్రం వైఖరిపై పలువురు మాజీ సైనికాధికారులు విమర్శించడంతో ఆర్మీ ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.