దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది. అందుకే ఇక్కడ ప్రచారం కోసం పలుపార్టీలు కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి.
ఈ నేపథ్యంలో యూపీలోని నోయిడాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ బృందంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్లంతా ప్రచారం సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా బాఘేల్ స్పందించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తే ఇదే జరుగుతుందని, ఎఫ్ఐఆర్లు నమోదవుతాయని విమర్శించారు. రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంఖూరి పాఠక్ తరఫున బాఘేల్ ప్రచారం నిర్వహించారు.