Bombay High Court | ముంబై, ఏప్రిల్ 11: సాధారణంగా భరణం కేసుల్లో భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు తీర్పులు చెబుతుంటాయి. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ షర్మిల దేశ్ముఖ్ ఈ నెల 2న తీర్పు చెబుతూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం‘జీవిత భాగస్వామి’ అన్న పదం అటు భర్తకు, ఇటు భార్యకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
అనారోగ్యం కారణంగా తన భర్త సంపాదించడం లేదని భార్యే స్వయంగా పేర్కొన్నందున అందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు. పోషించుకోలేని స్థితిలో భర్త ఉండి, భార్య సంపాదిస్తున్నప్పుడు విడాకులు పొందినా.. అతని నిర్వహణను చూసే బాధ్యత భార్యదేనని, కాబట్టి నెలనెలా ఆమెయే అతనికి సంరక్షణ ఖర్చులు చెల్లించాలని తీర్పు చెప్పారు.