Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచనల వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదం అవుతుందని అన్నారు. దీనిపై ముస్లిం సమాజం ముందుకు వచ్చి ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి మాట్లాడుతూ.. ‘ జ్ఞానవాపిని మసీదు అని పిలవలేం. అలా పిలిస్తే అది వివాదం అవుతుంది. ఎవరికి భగవంతుని దర్శనభాగ్యం లభించిందో.. ఆ వ్యక్తి చూడాలని నేను భావిస్తున్నాను. మసీదులో త్రిశూలం ఎందుకు ఉంది..? మేము దానిని అక్కడ ఉంచలేదు. జ్యోతిర్లింగం ఉంది, దేవుళ్ల ప్రతిమలు (విగ్రహాలు) ఉన్నాయి. గోడలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ‘చారిత్రక తప్పిదమే’. ముస్లిం సమాజం ఈ తప్పును అంగీకరించాలి. ఈ వివాదానికి పరిష్కారం ముస్లిం సమాజం నుంచే రావాలని అనుకుంటున్నాను. చారిత్రక తప్పిదానికి పరిష్కారం చూపేందుకు వారు ఓ ప్రతిపాదనతో రావాలని నేను భావిస్తున్నాను’ అని యోగి వ్యాఖ్యానించారు.
Also Read..
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
Tourist Plane | సముద్రంలో ల్యాండ్ అయిన టూరిస్ట్ విమానం.. ప్రయాణికులు సేఫ్