శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ రాజోరి జిల్లా డాంగ్రీ ప్రాంతంలో సోమవారం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, మరొకరు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. గత 24 గంటల్లో దాడి జరుగడంతో ఇది రెండోది. ఆదివారం రాజౌరి జిల్లాలో డాంగ్రీ గ్రామంలో ఇద్దరు మాస్క్లు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా గ్రామస్తులు మృతదేహాలను నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు.
రాజోరి జిల్లా డిప్యూటీ కమిషనర్ను, ఎస్ఎస్పీని బదిలీ చేయాలని నిరసన కారులు కోరారు. 24గంటల్లో జరిగిన రెండు ఘటనలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని డాంగ్రీ సర్పంచ్ ధీరజ్ శర్మ పేర్కొన్నారు. వరుస ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. భారత్ – పాక్ నియంత్రణ రేఖకు ఆనుకొని ఉన్న రాజౌరి జిల్లాలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందారు. మృతులను దీపక్ కుమార్ (23), సతీశ్ కుమార్ (45), అక్ష్మాన్, ప్రీతమ్ లాల్ (56)గా గుర్తించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రానాలు కోల్పోయాడు. దాడి తమపనేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది.