ఢిల్లీలో ఐఏఎస్ అధికారి నిర్వాకం
విమర్శలు రావడంతో కేంద్రం బదిలీ వేటు
న్యూఢిల్లీ, మే 26: దేశ రాజధానిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియానికి ఓ ఐఏఎస్ అధికారి సాయంత్రం పెంపుడు కుక్కతో వాకింగ్కు వస్తున్నారని అక్కడి అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నా రు. గత కొద్ది నెలలుగా ఇలాగే జరుగుతున్నది. ఆయన పేరు సంజీవ్ ఖిర్వార్. ప్రస్తుతం ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కుక్కతో ఖాళీ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రోజూ 7 గంటలకు స్టేడియాన్ని మూసేస్తారు.
అప్పటివరకు క్రీడాకారులు శిక్షణ పొందుతారు. ఐఏఎస్ వస్తారని అరగంట ముందే వారందరినీ బయటకు పంపిస్తున్నారు. దీంతో తమ శిక్షణకు ఆటంకం కలుగుతున్నదని క్రీడాకారులు వాపోతున్నారు. తాను కుక్కతో కలసి వాకింగ్కు రావడం నిజమేనని, అయితే క్రీడాకారులకు ఇబ్బంది కలిగించలేదని సంజీవ్ వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఘటనను కేంద్ర హోం శాఖ సీరియస్గా తీసుకుంది. సంజీవ్ ఖిర్వార్ను లఢక్కు, ఆయన భార్య, ఐఏఎస్ అధికారి రింకూ దుగ్గను అరుణాచల్ప్రదేశ్కు బదిలీ చేసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సీఎస్ నరేశ్కుమార్ను ఆదేశించింది.