కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మద్దతు ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన తాను ఓ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఆమె తెలిపారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి టీఎంసీ పార్టీ పోటీ చేస్తుందని దీదీ అన్నారు.