బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు కర్ణాటక బీజేపీకి (Karnataka BJP) షాక్ మీద షాక్ తగులుతోంది. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకుగాను బీజేపీ బుధవారం 189 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు తొలి జాబితా విడుదల చేసింది. దాంతో తొలి జాబితాలో పేరులోని సిట్టింగ్లు, సీనియర్ నేతల నుంచి బీజేపీకి అసంతృప్తుల సెగ మొదలైంది.
అసెంబ్లీ టికెట్ను ఆశించి భంగపడిన వారిలో కొందరు నేతలు బుధవారమే బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మడిగెరె నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కుమారస్వామికి బీజేపీ టికెట్ నిరాకరించింది. తొలి జాబితాలో ఆయన స్థానాన్ని మరో అభ్యర్థికి కేటాయించారు.
దాంతో ఎంపీ కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇవాళ స్పీకర్కు తన రాజీనామా లేఖ సమర్పిస్తానని ప్రకటించారు. కాగా, ఎంపీ కుమారస్వామి ఇటీవల ఎనిమిది చెక్కులు బౌన్స్ అయిన కేసులో దోషిగా తేలాడు. అందుకే ఆయనను పక్కనపెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.