బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. ఆ పార్టీ తరపున ఎవరు సీఎం అవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. సీఎం పదవి రేసులో ఉన్న విషజ్ఞం తెలిసిందే. అయితే సీఎం అభ్యర్థిని తేల్చేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే సిద్దరామయ్య ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ డీకే శివకుమార్(DK Shivakumar) కూడా కాంగ్రెస్ సీనియర్లతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమది ఐక్య కూటమి అని, మా సంఖ్య 135 అని, కూటమిని విభజించాలన్న ఆలోచన తనకు లేదని డీకే అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను ఆదరించినా, ఆదరించకపోయినా.. తాను బాధ్యత కలిగిన వ్యక్తి అని అన్నారు. ఎవర్ని వెన్నుపోటు పొడవడను అని, ఎవర్నీ బ్లాక్మెయిల్ చేయడం లేదని డీకే తెలిపారు.
#WATCH | Bengaluru: "We have built this party (Congress), we have built this house. I am a part of it…A mother will give everything to her child": Karnataka Congress president DK Shivakumar before leaving for Delhi pic.twitter.com/0GMTSZKxpJ
— ANI (@ANI) May 16, 2023
అయితే కడుపు ఇన్ఫెక్షన్ వల్ల నిన్న తాను బెంగుళూరులోనే ఉండి పోవాల్సి వచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే తెలిపారు.