కోల్కతా: గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)పై కాగ్తో ఆడిట్ చేయిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తెలిపారు. జీటీఏ సరిగా పనిచేయడం లేదని అందరూ తనకు చెప్పారన్నారు. 2017 నుండి ఎన్నికలు జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అవినీతి, అసమర్థత గుహ అని గవర్నర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో జీటీఏను కాగ్తో ఆడిట్ చేయిస్తానని జగదీప్ ధంఖర్ వెల్లడించారు.