న్యూఢిల్లీ: కేంద్రం ఇవాళ ముగ్గురికి భారతరత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్ సింగ్లతో పాటు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారత రత్న పురస్కారం దక్కింది. ఆ ముగ్గురికీ భారత రత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ(Sonai Gandhi) అన్నారు. పార్లమెంట్ ఆవరణలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.