శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపించారు. మృతదేహాల కోసం ఆయా కుటుంబాలను ఎస్పీ, కంట్రోల్ రూమ్కు గురువారం పిలిచారని, అయితే రెండు, మూడు రోజుల తర్వాత రావాలని వారికి చెప్పడంపై మండిపడ్డారు.
దీనిపై తన కోపం, నిస్సహాయతను నిరసన ద్వారా వ్యక్తం చేస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. బాధిత కుటుంబాలు ప్రెస్ కాలనీలో శాంతియుతంగా నిరసన కూడా చేయలేకపోయారని అన్నారు. పౌరుల మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.