న్యూఢిల్లీ: దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. అయినా ఉత్తరాదిలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాంధీ మాత్రం టీషర్ట్ వేసుకునే తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. మీడియా ప్రతినిధులు టీషర్ట్ గురించి ప్రస్తావించారు.
దాంతో రాహుల్గాంధీ ఫన్నీగా సమాధానం చెప్పారు. నేను టీషర్ట్ వేసుకోవడం గురించి అందరూ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు..? అని ప్రశ్నించారు. చలి గురించి తనకు భయం లేదు కాబట్టి తాను స్వెట్టర్ వేసుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ తనకు చలి భరించలేకుండా ఉందనే ఫీలింగ్ కలిగితే.. అప్పుడు స్వెట్టర్ వేసుకోవడం గురించి ఆలోచిస్తానని అన్నారు.