తిరువనంతపురం, జూలై 5: ఇప్పుడు మనం చెప్పుకొనే దొంగ తీరే విలక్షణం. వేరే రాష్ట్రం నుంచి దర్జాగా విమానంలో వచ్చి మరీ దొంగతనాలు చేస్తాడు. విమానంలో వస్తాడు.. ఓ ఆటోలో వీధుల్లో తిరుగుతూ.. తాళాలు వేసివున్న ఇండ్లను గుర్తిస్తాడు. రాత్రికి ఆ ఇండ్లకు చేరుకొని, బంగారం మాత్రమే దొంగిలించుకుపోతాడు. తర్వాత అక్కడే అమ్మేసుకొంటాడు. ఈ ఘరానా దొంగను కేరళ పోలీసులు బుధవారం తిరువనంతపురం ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఉమాప్రసాద్గా పోలీసులు గుర్తించారు. పద్మనాభస్వామి దర్శనం పేరుతో ఉమాప్రసాద్ మేలో వచ్చాడని, జూన్లో ఒక నెల ప్లానింగ్ తర్వాత దొంగతనానికి మళ్లీ వచ్చాడని పోలీసు కమిషనర్ తెలిపారు.