హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అతడి భార్య ఫాతిమా రిజ్వీ వివరాల ప్రకారం.. ఈ నెల 4న తన అపార్టుమెంట్ సమీపంలో సయ్యద్ను కొందరు అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. వెంటనే అతడిని స్థానిక దవాఖానలో చేర్చారు. అతని మిత్రుడు ఫోన్ ద్వారా భారత్లోని ఫాతిమాకు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన తన భర్తకు ఫోన్ చేశానని, ఆయన కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, ఆయనకి తగిన వైద్య సహాయం అందించాలని ఆమె మంగళవారం విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేసింది.