అడ్డగుట్ట, జూన్ 16: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న, డీసీ మోహన్రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకట్నగర్లో రూ.13లక్షలతో సీసీ రోడ్డు, 48లక్షలతో ఓపెన్ నాలా, రూ.5లక్షలతో పవర్ బోర్, సాయినగర్లో రూ.12లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యలను దాదాపుగా పూర్తి చేశామని అన్నారు.
నిధుల విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా కోట్లాది నిధులను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ ఆశాలత, డీఈ రఘు, ఏఈ విశ్వతేజ, జలమండలి డీజీఎం కృష్ణ, ఏఈ స్రవంతి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామేశ్వర్గౌడ్, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నక్క మధు, సత్తయ్యగౌడ్, శ్రీనివాస్గౌడ్, వసంత, మనోహర్, అంజయ్య, పొన్నాల రాజు, అమర్, వడ్లూరి రవి, గౌస్, మహ్మద్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
టీకా కేంద్రాన్ని పరిశీలించిన
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 16: స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించిన మహిళల కోసం ప్రత్యేక టీకా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. తార్నాక డివిజన్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి ప్రారంభించి, టీకా ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఈ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత వేర్వేరుగా సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకా కేంద్రాల్లో రద్దీ నేపథ్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి అపోహలు లేకుండా 18 ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏఎంహెచ్వో డాక్టర్ రవీందర్గౌడ్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సునీల్ముదిరాజ్, నాగేశ్వర్రావు, వంజరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.