చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతులు కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ జరుగుతున్నది. ఒకే బస్సులో వీరిద్దరూ వచ్చారు. కోర్టు బస్టాండ్ వద్దకు రాగానే కామరాజు తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.