కోల్కతా: ట్యూషన్కు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు. (Protests In Bengal) పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిషామారి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతున్నది. శుక్రవారం ట్యూషన్కు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి వస్తూ అదృశ్యమైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మహిషామారి పోలీస్ క్యాంప్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే జయనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు చెప్పారు.
కాగా, శనివారం తెల్లవారుజామున బాలిక మృతదేహం కాలువలో కనిపించింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మహిషామారి పోలీస్ క్యాంప్పై దాడి చేసి ధ్వంసం చేశారు. కొందరు పోలీసులను కూడా చీవుళ్లతో కొట్టారు. టీఎంసీ నేతను తరిమారు.
మరోవైపు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని నియంత్రించారు. బాలిక కిడ్నాప్, హత్యకు సంబంధించి 19 ఏళ్ల ముస్తాకీన్ సర్దార్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, దసరా సందర్భంగా బెంగాల్లో దుర్గా మాత పూజల నేపథ్యంలో ఈ సంఘటన జరుగడంపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.
In another shocking incident in West Bengal, an 11 year old minor Hindu girl, is abducted, brutally raped and murdered, while she was returning back from tuition, in the Kripakhali area, under Kultali police station. The villagers found her lifeless body from the riverbank.… pic.twitter.com/CjNJJtMdJv
— Amit Malviya (@amitmalviya) October 5, 2024