తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాని భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకున్నది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీనివాడి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాగా, ఏప్రిల్ 6న స్వామివారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.