Congress | వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇందు కోసం నేషనల్ అలయన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్ను సభ్యులుగా నియమించింది.
ఈ కమిటీకి ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తక్షణమే అమలులోకి వచ్చేలా అలయన్స్ కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తు అంశాలను కమిటీ పరిశీలించనున్నది.