న్యూఢిల్లీ: మనిషి వ్యక్తిగత గుర్తింపునకు ఇప్పుడు ఆధార్కార్డు తప్పనిసరయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏ పని జరుగాలన్నా ఇప్పుడు ఆధార్కార్డును తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే, ఆధార్కార్డుపై దిగిన ఫొటోలు కొన్నేండ్ల తర్వాత మనమేనా..? కాదా.. అనే సందేహం కలిగేలా ఉంటున్నాయి. ఎందుకంటే ఏటికేడు మనిషి రూపులో మార్పు వస్తుంది. కానీ ఫొటోల్లో మార్పు ఉండదు. కాబట్టి ఆధార్కార్డుపై ఉన్న ఫొటోకు మనకు ఏమాత్రం పోలికలు కనిపించవు. దాంతో మన పనులు నిలిచేపోయే ప్రమాదం ఉన్నది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆధార్కార్డుపై ఉన్న ఫొటోను మార్చుకోవడం ఒకటే మార్గం. మరి అదెలాగో తెలుసుకుందామా..?