రామాయంపేట, మే 3 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డిగారి ముత్యంరెడ్డి(93) అనారోగ్యంతో హైదరాబాద్లోని బోయినపల్లిలో ఆదివారం రాత్రి మృతి చెందారు. ముత్యంరెడ్డి స్వగ్రామమైన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలోని ఆయన స్వగృహానికి సోమవారం మృతదేహాన్ని తరలించారు. దివంగత నేతకు పలువురు నాయకులు పార్టీల కతీతంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా అనతికాలంలోనే రామా యంపేటలోని ప్రభుత్వ కళాశాల, బస్టాండ్, ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేయించారు. తాలూకా నుంచి సమితిగా చేసి సమితి ప్రెసిడెంట్గా కూడా కొనసాగారు. 1980లో సీఎంగా టి.అంజయ్య రావడంతో ఆయన మాట ప్రకారం కట్టుబడి రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రామాయంపేట ఎమ్మెల్యేగా టి.అంజయ్య ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. అక్కడి నుంచి ముత్యం రెడ్డి రాజకీయ జీవితం 1981 నుంచి 85 వరకు జడ్పీ చైర్మన్గా నాలుగేండ్లు కొనసాగారు.
అనంతరం మెదక్ ఎల్ఎంబీ (అంజుమన్ సొసైటీ) చైర్మన్గా పనిచేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఆయన కొనసాగారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన ముత్యంరెడ్డి 1985లో రామాయం పేట శాసనసభ స్థానానికి పోటీచేసి బీజేపీ నేత ఆర్ఎస్ వాసురెడ్డి చేతిలో ఓటమి పొందారు. పట్టువదలని విక్రమార్కుడిలా పేరుగాంచిన ఆయన రామాయంపేట నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకుని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ దవాఖాన, బస్టాండ్కు సీఎం అంజయ్యతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయిం చారు. ఎక్కడ సమస్యలుంటే అక్కడికి నేరుగా వెళ్లి పరిష్కరించే మనస్త త్వం గల నేత ముత్యంరెడ్డి. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ రామాయంపేట నియోజకవర్గంలో కని పిస్తున్నాయి. సీఎం కేసీఆర్తో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సన్నిహితంగా ముత్యం రెడ్డి ఉండేవారు. ఆయన కొన్నేండ్లుగా అనారోగ్యానికి గురై మంచాన పడ్డారు.
హైదరాబాద్లోని బోయిన పల్లిలో ముత్యంరెడ్డి నివాస గృహంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. ఆయన మృత దేహాన్ని స్వగ్రామమైన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామానికి తరలించారు. ముత్యంరెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి పార్థివదేహానికి నివాళులర్పిం చారు. ముత్యంరెడ్డికి సంతానం లేదు. ఆయనకు భార్య వెంకటాయమ్మ ఉన్నారు. ముత్యంరెడ్డి పార్థివదేహంపై తహసీల్దార్ రాజేశ్వర్రావు జాతీయ పతాకాన్ని కప్పారు. ముత్తిరెడ్డి దత్తత పుత్రుడు అంజిరెడ్డి చితికి నిప్పంటించారు.
మాజీ ఎమ్మెల్యే మృతికి సంతాపం..
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాపిరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ అనంతరెడ్డి.. చిన్నశంకరంపేటలో ముత్యంరెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా ఒక ఆదర్శవంతమైన నాయకుడిని కోల్పో యిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్రెడ్డి, రామా యంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి, చిన్నశం కరంపేట, రామాయంపేట, కొల్చా రం, వెల్దుర్తి మండ లాల నాయకులు, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, రామా యంపేట ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి సంతాపం తెలిపారు. మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు ముత్యంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.