Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్పై కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ మణిపూర్ లోని తొమ్మిది తీవ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, సంఘాలపై నిషేధం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థలపై నిషేధం పొడిగిస్తున్నట్లు సోమవారం కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పీపుల్స్ లిబరేసన్ పార్టీ (పీఎల్ఏ), దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీతోపాటు తొమ్మిది సంస్థలు, వాటి అనుబంధ విభాగాలపై వచ్చే ఐదేండ్ల పాటు నిషేధం కొనసాగుతుందని హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ సంస్థలు మణిపూర్లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులతోపాటు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు హానికర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది.