కేంద్ర హోంమంత్రి అమిత్షా నోట మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. భారత్పై అక్రమంగా నిఘా పెట్టే వారిపై కచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరుతామని సంచలన ప్రకటన చేశారు. గతంలోనూ ఇలాగే చేశామని, ఇప్పుడు కూడా చేయడానికి రెడీగానే ఉన్నామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్షా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. యూపీఏ ప్రభుత్వం దేశ రక్షణతో చెలగాటమాడిందని, తాము మాత్రం ఈ సంస్కృతిని ప్రోత్సహించదలుచుకోలేదని అన్నారు. మోదీ హయాంలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇక ముందు కూడా ఈ చర్యలే తీసుకుంటామని అమిత్షా ప్రకటించారు.
ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందని, మన్మోహన్- సోనియా సర్కార్ లేదని, ఈ విషయం పాకిస్తాన్ మరిచిపోయి ఉంటుందని అమిత్షా చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరిగాయని ఆరోపించారు. కానీ… మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్తో తగిన కౌంటర్ ఇచ్చామని అమిత్షా ప్రకటించారు.