ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రయాణించే మార్గంలో ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బెంగళూరులోని యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మోదీ ల్యాండ్ అవుతారని.. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ కమాండ్కు చెందిన చాపర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కి చేరుకుంటారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఐఐఎస్సీలో మోదీ రెండు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ సెల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మైండ్ట్రీ ఏర్పాటు చే్తున్న 850 పడకల రీసెర్చ్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నారు.