న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర సంతాపం చేశారు. ఆయన తన జీవితాన్ని దేశానికి, ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. జాతీయ వాదిగా ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని శనివారం రాత్రి ట్వీట్ చేశారు. కల్యాణ్ సింగ్ వంటి గొప్ప వ్యక్తిత్వం గల నేతలు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.
యూపీ సీఎంగా కల్యాణ్ సింగ్ సుపరిపాలనను అందించారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. రాజకీయ చాతుర్యంతో, భక్తితో ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పాలన సాగించారన్నారు. సుపరిపాలనకు అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యారంగంలో అసాధారణ సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. కల్యాణ్ సింగ్ మరణం పట్ల యావత్ దేశం, బీజేపీ కుటుంబం తీవ్ర సంతాపం తెలియజేస్తున్నదని హిందీలో ట్వీట్ చేశారు.