జమ్మూ కశ్మీర్ పోలీసులు తమ ఆపరేషన్లో సక్సెస్ అయ్యారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో శుక్రవారం ఓ ఎన్కౌంటర్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఇందులో ఓ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ అని పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ ఎన్కౌంటర్లో అష్రఫ్ మోల్వీ అనే ఉగ్రవాది మోస్ట్ వాటెండ్ అని, ఆయనను మట్టుబెట్టామని జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో తాము సక్సెస్ అయ్యామని తెలిపారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పహల్గామ్ అటవీ ప్రాంతంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం తమకు అందిందని ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో తాము కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ ఆపరేషనే తర్వాత ఎన్కౌంటర్గా మారిపోయిందని పోలీసులు తెలిపారు.
Ashraf Molvi (one of oldest surviving #terrorist of HM #terror outfit) along with two other terrorists killed. #Successful #operation on yatra route is a major #success for us: IGP Kashmir https://t.co/k8uololRrT
— Kashmir Zone Police (@KashmirPolice) May 6, 2022