భోపాల్ : హిందూ రాజ్య ఏర్పాటుకు సంబంధించి తనకు తాను స్వామీజీగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి లేవెనత్తిన డిమాండ్పై కాంగ్రెస్ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ (Kamal Nath) స్పందించారు. దేశంలో 82 శాతం మెజారిటీ ప్రజలు హిందువులేనని, ఆ రకంగా భారత్ ఇప్పటికే హిందూ రాజ్యమని సీనియర్ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. జన గణన ఆధారంగా ఈ విషయం సుస్పష్టమైందని, దీనిపై ఇక చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో 82 శాతం ప్రజలు హిందువులని గణాంకాలు వెల్లడిస్తున్నాయని, మనది హిందూ రాజ్యం అనడంలో ఎలాంటి చర్చ అవసరం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించారు.
చింద్వారాలో భాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి హిందూ రాజ్యంపై చేసిన వ్యాఖ్యలను కమల్ నాధ్ కుమారుడు నకుల్ కమల్ నాధ్ స్వాగతించడాన్ని ఆర్జేడీ నేత ఖండించిన నేపధ్యంలో కమల్ నాధ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విపక్ష కూటమి ఇండియాలో ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కావడం విశేషం. నూతనంగా ఏర్పడిన విపక్ష కూటమిలో ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ నకుల్ కమల్నాధ్ వత్తాసు పలకడం పట్ల ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ను హిందూ రాజ్యంగా ప్రకటించాని శాస్త్రి బాహాటంగా డిమాండ్ చేయడం ఆక్షేపణీయమని తివారీ స్పష్టం చేశారు. శాస్త్రి హిందుత్వ అజెండాకు తాము వ్యతిరేకమని, దేశాన్ని రాజ్యాంగం నడిపిస్తుందని, వ్యక్తుల భావజాలం కాదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆర్జేడీ నేత హితవు పలికారు.
Read More :
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా