న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసర్చ్ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూపు తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూపుపై దర్యాప్తు చేపట్టింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఆగష్టు 14వ తేదీన అందజేయాలని ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) తన ఆదేశాల్లో పేర్కొన్నది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహ, జేబీ పర్ధివాలాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. నిజానికి అదానీ గ్రూపుపై దర్యాప్తు కోసం ఆరు నెలల సమయం ఇవ్వాలని సెబీ కోరింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఇవ్వవచ్చు అని, కానీ ఆగస్టు 14వ తేదీన మీ స్టేటస్ ఏంటో ఆ రిపోర్టులో వెల్లడించాలని కోర్టు చెప్పింది. నిపుణుల కమిటీ దీనిపై రిపోర్టు ఇచ్చిందని, కానీ సమ్మర్ బ్రేక్ తర్వాత దాన్ని విశ్లేషించనున్నట్లు కోర్టు తెలిపింది.