సిమ్లా: ఆ పోలింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నది. అయితే వంద శాతం పోలింగ్ నమోదయింది. గడ్డకట్టించే చలిలోకూడా ప్రజలు తమ ఓటుహక్కు నమోదుచేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 66.58 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది గతంలోకంటే 9 శాతం తక్కువ అని తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 7884 పోలింగ్ కేంద్రాల్లో ఓ సెంటర్లో వందశాతం ఓటింగ్ నమోదయింది. అదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న తాషిగాంగ్లో..
సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ఆ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 52 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటుహక్కు వినియోగించుకుని రికార్డుల్లో నిలిచారు. ఇక సిర్మౌర్ జిల్లాలో 72.35 శాతం, సోలన్లో 68.48 శాతం మంది ఓటు వేశారు. అత్యల్పంగా లాహౌల్, స్పిటిలో 21.95 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం జైరాం ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సెరాజ్ నియోజకవర్గంలో 74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నా భార్మౌర్ నియోజకవర్గంలో 83 ఏండ్ల మహిళ చాసక్ భత్ప్రి ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసి, తనువు చాలించిన విషయం తెలిసిందే.
Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL
— CEO Himachal (@hpelection) November 12, 2022