పల్లెప్రగతి’ సద్వినియోగంతో అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
ఈర్లపూడి విద్యుత్ సబ్స్టేషన్కు స్థల దానం అభినందనీయం
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్కుమార్
రఘునాథపాలెం, జూలై 6: పల్లెల సమగ్రాభివృద్ధి సాధించేందుకు పల్లెప్రగతి కార్యక్రమం ఒక సువర్ణావకాశమని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, వైకుంఠధామం, డంపింగ్యార్డులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ముందుగా సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని వితరణ చేసిన రైతు కుటుంబాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దాత కుమారుడికి ఆపరేటర్గా ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పిన మంత్రి.. త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక వారిని శాలువాతో సత్కరించారు. మంచుకొండ – పంగిడి బీటీ రోడ్డు రెన్యువల్ కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం హరితహారంలో భాగంగా గ్రామ మహిళలకు ఒక్కొక్కరికీ ఆరు చొప్పున పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ ప్రియాంక, విద్యుత్ ఎస్ఈ రమేశ్, సర్పంచ్ దేవ్సింగ్, ఉప సర్పంచ్ నర్సింహారావు, ఏఎంసీ డైరెక్టర్ రవిప్రకాశ్, ఆర్డీవో రవీంద్రనాథ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గుడిపూడి రామారావు, మందడపు సుధాకర్, దొంతు సత్యనారాయణ, లక్ష్మణ్నాయక్, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, కుమ్మరి వెంకటకోటయ్య, ఎంపీటీసీ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.