సిద్దిపేట/ కోహీర్, ఏప్రిల్18: మెదక్, జహీరాబాద్ గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభ్యర్థులకు సూచిం చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి బీఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీ స్థానాలను మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం రూ.95లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం అభ్యర్థులు అధినేత కేసీఆర్ ఆశీస్సులు పొంది, నియోజకవర్గాల్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి తెలియజేశారు. అభ్యర్థులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.