న్యూఢిల్లీ: దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన ఎన్జీవోలు తాము సమర్పించే వార్షిక నివేదికలలో విదేశీ నిధులతో సమకూర్చుకున్న స్థిరాస్థి, చరాస్థి వివరాలను తప్పకుండా పొందుపర్చాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.