డెహ్రాడూన్ : శీతాకాలం సందర్భంగా హేమకుండ్ సాహిబ్ గురుద్వారా తలుపులను సోమవారం మూసివేశారు. ఉదయం గంటల నుంచి గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హేమ్కుండ్ సాహిబ్ ప్రధాన ధర్మకర్త జనక్ సింగ్తోపాటు సుమారు 1500 మంది భక్తులు గురుద్వారా ద్వారాల మూసివేత సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు గోవింద్ ఘాట్ గురుద్వారా సీనియర్ మేనేజర్ సర్దార్ సేవాసింగ్ తెలిపారు. ఈ ఏడాది 2.47లక్షల మంది భక్తులు హేమకుండ్ సాహిబ్ను దర్శించుకున్నారని పేర్కొన్నారు. మరో వైపు హేమకుండ్లో భారీగా హిమపాతం కురుస్తున్నది. రెండురోజులుగా కురుస్తున్న మంచువర్షానికి దాదాపు అర అడుగు వరకు మంచు పేరుకుపోయింది.