రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు బుధవారం దీనిని తిరస్కరించింది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12న ముగియనున్నాయి.
కాగా, మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హేమంత్ సోరెన్ను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది. 13 రోజుల ఈడీ కస్టడీ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. అయితే ఈడీ అరెస్ట్కు ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు ఫిబ్రవరి 5న కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొంది. హేమంత్ సోరెన్ కోర్టు అనుమతితో అసెంబ్లీకి హాజరయ్యారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. అయితే బడ్జెట్ సమావేశాలకు హాజరు కోసం హేమంత్ సోరెన్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మరో పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు రిజర్వ్ చేసింది.