ఢిల్లీలో సోమవారం కుంభవృష్టి కురిసింది. గత కొన్ని రోజులుగా వడగాలులతో అల్లాడుతన్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం ప్రభావంతో ఢిల్లీలో ఉష్ణోగ్రత గంటలోనే 18 డిగ్రీలు తగ్గిపోయింది. ఇదొక రికార్డు అని భారత వాతావరణ విభాగం తెలిపింది.