యాదాద్రి, మే2: మచ్చలేని పాలన సాగిస్త్తూ ఆలేరు ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దంపతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ నాయకుడు బోరెడ్డి అయోధ్యరెడ్డి చేసిన ఆరోపణలపై వారు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ సవాల్ విసిరారు. దేవాలయ, అసైన్డ్, ప్రభుత్వ భూములను ప్రభుత్వ విప్ దంపతులు కబ్జా చేసినట్లుగా ఆధారాలు ఉన్నా, కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేసినా చర్చకు రావాలన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడా రు. యాదగిరిగుట్టకు చెందిన బీజేపీ నాయకులతో విచారణ జరిపించి, ఆధారాలుంటే మాట్లాడాలని బండి సంజయ్కు హితవు పలికారు. బోరెడ్డి అయోధ్యరెడ్డి స్క్రిప్ట్ను బండి సంజయ్ చదివారని, ఎక్కడా ఆధారాలు లేవన్నారు. గొంగిడి దంపతులు ఎలాంటి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన దాఖలాలు లేవని గతేడాదిలోనే కలెక్టర్ నివేదిక ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, జsuryapet 03-05-2021డ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపా క స్వామి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ బాబా, టీఆర్ఎస్ నాయకులు అంకం నర్సింహ్మ, కీసరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.