జైపూర్, అక్టోబర్ 28: రాజస్థాన్లో ఉచితాలు, తాయిలాలతో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు, డ్రగ్స్, బంగారు ఆభరణాలు పోలీసులకు పట్టుబడుతున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో పోలీసులు సీజ్ చేసిన ఎన్నికల ఉచితాల విలువ రూ.214 కోట్లు ఉంటుందని ఐజీ వికాస్ కుమార్ శనివారం మీడియాకు తెలిపారు. రూ.60 కోట్ల విలువజేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని చెప్పారు. ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నాటి నుంచి రూ.25 కోట్ల అక్రమ నగదు, 20 కోట్ల మద్యం, రూ.20కోట్ల బంగారం పట్టుబడింది. ఇదంతా ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకే. పెట్రోల్, డీజిల్, ఎరువులు..మొదలైనవి కూడా సీజ్ చేశాం’ అని ఐజీ వికాస్ కుమార్ వివరించారు.