బీజింగ్, ఏప్రిల్ 26: కరోనా కేసుల విజృంభణతో చైనా సతమతమవుతున్నది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో వెలుగుచూస్తున్న కొత్త కేసులతో షాంఘై నగరం దాదాపు గత మూడు వారాలుగా లాక్డౌన్లో కొనసాగుతుండగా, ఇప్పుడు రాజధాని బీజింగ్ వంతు వచ్చింది.
రాజధాని పరిధిలోని చావోయాంగ్ జిల్లాలో సోమవారం 32 కొత్త కేసులు వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని 2.1 కోట్ల మందికి సామూహిక పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు షాంఘైలో కరోనాతో తాజాగా 52 మంది మరణించారు. దీంతో ఇక్కడ మరణాల సంఖ్య 190కి చేరింది.
for everyone in