న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత జాతీయ పతాకధారి రేసులో స్టార్ షట్లర్ పీవీ సింధు ముందంజలో ఉంది. గతానికి భిన్నంగా ఈసారి విశ్వక్రీడల ప్రారంభ కార్యక్రమంలో భారత బృందానికి ఇద్దరు నాయకత్వం వహించబోతున్నారు. ఇందులో మహిళల నుంచి సింధుకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు ఐవోఏ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. పురుషుల నుంచి నీరజ్ చోప్రా, శరత్ కమల్, బజ్రంగ్ పునియా, అమిత్ పంగల్..పతాకాన్ని చేబూనే అవకాశముంది.