ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయని జీనోమ్ సీక్వెన్సింగ్లో వెల్లడవుతున్నదని తెలిపారు. ఒమైక్రాన్ వేరియంట్ ర్యాపిడ్ స్పీడ్తో వ్యాప్తిచెందుతుందని, రోజుకు 10వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. మహానగరంలో గత 24 గంటల్లో 2500లకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మరో ఆరువారాల్లో ఒమిక్రాన్ పతనాన్ని చూడవచ్చని తెలిపారు. ప్రజలు ఈ కొత్త వేరియంట్ గురించి భయపడవద్దని సూచించారు. లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రతిఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. సాధారణ జలుబు లేదా ఫ్లూ లాగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, అలసట, వెన్నునొప్పి, తలనొప్పి వంటివి ఒమిక్రాన్ లక్షణాలని తెలిపారు.