ఢిల్లీ : (Anil Vij) హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అనిల్ విజ్కు వివిధ ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నేతృత్వంలో వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
సోమవారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో అనిల్ విజ్ ఇబ్బంది పడ్డారు. వెంటనే కుటుంబసభ్యులకు తెలుపడంతో వారు ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. ఆయనను ప్రైవేట్ వార్డులో చేర్చి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆయనను పరీక్షించి, పలు ఆరోగ్య పరీక్షలు జరుపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొవిడ్ అనంతర సమస్యల్లో భాగంగా ఇలా శ్వాస సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్కు చెందిన వైద్యుడొకరు తెలిపారు. అనిల్ విజ్ అనారోగ్యం బారిన పడిన విషయం బయటకు రావడంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ధంకర్తో పాటు పలువురు సీనియర్ నేతలు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
గత నెల 23 న కూడా అనిల్ విజ్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఛండీగఢ్లోని పీజీఐ దవాఖానలో చేరి చికిత్స పొందారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో అనిల్ విజ్కు అత్యవసర చికిత్స అందించి కోలుకునేట్లు చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్.. ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. అయితే, ఈ కారణంగానే శాసనసభ వర్షాకాల సమావేశాలకు తొలి రోజు అనిల్ విజ్ గైర్హాజరయ్యారు. మరుసటి రోజు ముక్కుకు ఆక్సిజన్ పైపుతోనే ఆయన అసెంబ్లీకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..