Assembly Elections | చండీగఢ్, శ్రీనగర్: హర్యానా, జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. రెండు చోట్లా కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ రెండు చోట్ల బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. హర్యానాలో ఫలితాలపై రాజకీయ పార్టీలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా… పదేండ్ల తర్వాత అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. మరోవైపు 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటములు ధీమాగా ఉన్నాయి.