న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై మాజీ క్రికెటర్, రాజ్య సభ్యుడు హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఆప్ పార్టీ రాజ్యసభ టికెట్లను అమ్ముకుంటోందని బహిరంగంగా విమర్శించారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్భజన్ సింగ్ ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన స్పందించారు. తన మాజీ పార్టీతో బహిరంగంగా కొనసాగుతున్న వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తూ రాజ్యసభలో సీట్లను అమ్ముకుంటోందని, లంచాలు తీసుకుంటోందని ఆరోపించారు.
ఆప్ నాయకుడు దేవేందర్ యాదవ్ ఎక్స్ వేదికగా దేశద్రోహి అని ఆరోపించారు. దీనిపై స్పందించిన హర్భజన్ నన్ను దేశద్రోహి అని పిలుస్తున్న వారికి ముందు పంజాబ్ రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నారో మీ సొంత ప్రజలనే అడగండి. ఎవరికి ఎంత లంచం అందిందో, ఎవరి నుండి అందిందో నేను చెబుతాను. ఇంకా పంజాబ్ను దోచుకోవడానికి, లాలాకు సరుకులు చేరవేయడానికి ఒకరిని మంత్రిగానో లేదా వాచ్మన్గానో ఎలా నియమించారో కూడా చెబుతారని ప్రతిస్పందించాడు. రాజ్యసభ సీట్లు అమ్ముకోవడం ద్వారా ఎవరికి ఎంత ముట్టిందో బయటపెట్టాలా అని కీలక వ్యాఖ్యలు చేశారు.