న్యూఢిల్లీ, నవంబర్ 13: కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరగాళ్ల చేతులకు బేడీలు వేయొద్దని.. రేప్, హత్య లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారితో కలిపి ఉంచొద్దని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 3న సిఫారసు చేసింది.
ఆర్థిక నేరాల్లో చిన్నవి మొదలుకొని తీవ్రమైనవి కూడా ఉంటాయని.. ఈ నేపథ్యంలో ఈ విభాగంలోని అన్ని కేసుల్లో నిందితులకు బేడీలు వేయడం సరికాదని.. క్లాజ్ 43(3)లోని ‘ఆర్థిక నేరాలు’ పదాన్ని తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది.