న్యూఢిల్లీ: దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పట్టపగలు ఇళ్లు దాటి కాలు బయటపెట్టాలంటే జనం గడగడ వణికిపోతున్నారు. కానీ హిమాలయ ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. మండు వేసవిలోనూ అక్కడ మంచు కురుస్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని గురుద్వారా హేమకుంద్ సాహిబ్పై తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. గురుద్వారాపైన, పరిసరాల్లో దూది వెదజల్లినట్లు మంచు పరుచుకుని ఉన్నది. ఈ సుందర దృశ్యాన్ని పై చిత్రంలో మీరు కూడా వీక్షించవచ్చు.