(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గుజరాత్ గోద్రా అల్లర్ల సందర్భంగా తీసిన ఈ ఫోటో (మొదటిది) చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతడిని హిందువుల రక్షకుడిగా మీడియా చూపించింది. అతని పేరు అశోక్ పర్మార్. గుజరాత్ అల్లర్ల పోస్టర్ బాయ్గా పేరుగాంచారు.
ప్రస్తుతం ఓ రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఆయనతో ముచ్చటించగా.. గుజరాత్ మాడల్ ఒట్టి భూటకమేనని గంటా భజాయించి చెప్పారు. బీజేపీ సంపన్నుల పార్టీగా మారిందని ధ్వజమెత్తారు. అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపారులే లాభపడ్డారని విమర్శించారు.