అహ్మదాబాద్, ఏప్రిల్ 27: సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి గీతాగోపి తప్పుకున్నారు. ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పును నిలిపివేయాలని రాహుల్ మంగళవారం గుజరాత్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి గీతాగోపి విచారించాల్సి ఉండగా ఆమె తనకు తానే విచారణ నుంచి తప్పుకున్నట్టు చెప్పారని రాహుల్ తరఫు న్యాయవాది పీఎస్ చపనేరి తెలిపారు.